Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో రెండేళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి.. కాపాడిన తల్లి

Dog Attacks

సెల్వి

, బుధవారం, 24 జనవరి 2024 (22:34 IST)
Dog Attacks
ఢిల్లీలోని విశ్వాస్ నగర్ ప్రాంతంలో రెండేళ్ల చిన్నారిపై శునకం దాడి చేసింది. పెంపుడు కుక్కగా గుర్తించిన ఆ కుక్క పిల్లవాడిపైకి దూసుకెళ్లింది. రెండేళ్ల బాలుడి కాలిని పట్టుకుంది. సిసిటివి కెమెరాలో ఈ షాకింగ్ సంఘటన రికార్డ్ అయ్యింది. 
 
కుక్కపై ఆగ్రహంతో కుక్క దాడి నుండి తన బిడ్డను రక్షించడానికి తల్లి విశ్వప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యింది. పిల్లవాడి దగ్గరకు పరుగెడుతూ వెళ్లిన కుక్క ఆ చిన్నారిని నోటితో లాగుతున్నట్లు వీడియోలో రికార్డ్ అయ్యింది. 
 
వెంటనే, స్థానికులు, బాలుడి తల్లి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బిడ్డపై ఆ శునకం పదేపదే దూకి దాడి చేసింది. అయినా స్థానికులు దానిని వదలక తరిమికొట్టారు. ఈ ఘటనలో తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రొఫెషనల్స్ కోసం హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాల జాబితాను విడుదల చేసిన లింక్డ్‌ఇన్