మోడీపై పాక్ మీడియా ప్రశంసల జల్లు.. పెద్ద నోట్ల రద్దుకు పాక్ సర్కారు రెడీ అవుతుందా?
రూ.500, రూ. 1000 నోట్ల రద్దుపై పాకిస్థాన్ మీడియా స్పందించింది. నకిలీ కరెన్సీ, నల్లధనంపై పోరాటమే లక్ష్యంగా పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై భారతదేశంలోని ప్రతిపక్షాలు విమర
రూ.500, రూ. 1000 నోట్ల రద్దుపై పాకిస్థాన్ మీడియా స్పందించింది. నకిలీ కరెన్సీ, నల్లధనంపై పోరాటమే లక్ష్యంగా పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై భారతదేశంలోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ మీడియా మోడీపై ప్రశంసలు గుప్పించింది. నోట్ల రద్దుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గట్టి నిర్ణయం తీసుకున్నారని ఆకాశానికెత్తోస్తోంది.
పాకిస్థాన్లోని అనేక టీవీ ఛానళ్ళు దీనిపై చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి. చర్చల్లో పాల్గొన్న ఆర్థిక నిపుణులు, మేధావులు మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు. భేష్ అని ప్రశంసించారు. ఇంకా పాక్లో కూడా పెద్ద నోట్ల రద్దు చేపట్టాలని నవాజ్ షరీఫ్కు సర్కారుకు సలహా ఇచ్చారు.
మరోవైపు ప్రధాని మోదీ అడుగుజాడల్లో పాకిస్థాన్ కూడా నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో... పాకిస్థాన్లో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతి, అక్రమాలు, నల్లధనాన్ని అరికట్టేందుకు దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) సెనేటర్ ఉస్మాన్ సైఫుల్లాఖాన్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆర్థిక కమిటీ ముందు తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా దేశంలో చలామణిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను వెనక్కి తీసుకోవాలని అందులో కోరారు.