Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రార్థనా మందిరంపై దాడి... వందమంది ఉగ్రవాదులను హతం చేసిన పాకిస్థాన్

మసీదుపై దాడి చేసి వంద మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై పాకిస్థాన్ విరుచుకుపడింది. సింధ్ ప్రావిన్స్‌లోని లాల్ ఖలందర్ సూఫీ ప్రార్థనా మందిరంలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడికి పాక్ ప్రతీకారం తీర్చుకు

Advertiesment
Pakistan
, శనివారం, 18 ఫిబ్రవరి 2017 (10:43 IST)
మసీదుపై దాడి చేసి వంద మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై పాకిస్థాన్ విరుచుకుపడింది. సింధ్ ప్రావిన్స్‌లోని లాల్ ఖలందర్ సూఫీ ప్రార్థనా మందిరంలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడికి పాక్ ప్రతీకారం తీర్చుకుంది. దాడి జరిగిన వెంటనే స్పందించిన పాక్ శుక్రవారం నాటికి వందమంది ఉగ్రవాదులను హతమార్చింది. 
 
గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 88 మంది మృతి చెందగా 250 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాదుల ఏరివేతకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో పాక్ భద్రతా దళాలు దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం వందమంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 
 
మందిరంపై దాడి వెనక ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు గుర్తించిన పాక్ ఆర్మీ 76 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పేర్లున్న జాబితాను ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయానికి అందించి వెంటనే చర్యలు తీసుకోవడమో, లేదంటే తమకు అప్పగించడమో చేయాలని డిమాండ్ చేసింది. కాగా దాడి తమపనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పళనిస్వామికి ఓటు వేస్తే మీ అంతు చూస్తాం.. ఎమ్మెల్యేలకు అన్నాడీఎంకే కార్యర్తల వార్నింగ్