Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జీయా కేసుతో లింక్.. చిదంబరం ఇంటిపై సీబీఐ రైడ్

షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైలులో గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు నిర్వహించిన మీడియా కంపెనీకి లబ్ధి చేకూర్చారనే విషయంపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.

ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జీయా కేసుతో లింక్.. చిదంబరం ఇంటిపై సీబీఐ రైడ్
, మంగళవారం, 16 మే 2017 (11:41 IST)
షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైలులో గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు నిర్వహించిన మీడియా కంపెనీకి లబ్ధి చేకూర్చారనే విషయంపై కేంద్ర మాజీ ఆర్థిక, హోం మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఇంటితో పాటు 14 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి.

కార్తీ చిదంబరం సంస్థ 2008లో లంచాలు తీసుకుని ఐఎన్ఎక్స్ మీడియాకు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించినట్లు సీబీఐ వర్గాలు గుర్తించాయి. ఐఎన్ఎక్స్ మీడియా ఫారిన్ ఎక్చేంజ్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) నుంచి రూ.4కోట్ల నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. 
 
అయితే ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇప్పించేందుకు కార్తీ చిదంబరం సంస్థ రూ.10 లక్షలు లంచం తీసుకుందని.. ఆపై ఐఎన్ఎక్స్ మీడియా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రూ.305కోట్లను సమీకరించిందని సీబీఐ వర్గాల సమాచారం. ఈ ఒప్పందాలు కుదిరిన సమయంలో మాజీ ప్రధాన మంత్రి  మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారని.. ఈ స్కామ్‌లో పీసీ పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని సీబీఐ వర్గాల సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికలంటూ జరిగితే వైకాపాకు 118 - తెదేపాకు 37 సీట్లు : అభ్యర్థుల గెలుపుగుర్రాలపై జగన్ సర్వే