Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బైకు, కారు, ఫ్రిజ్, ఏసీ ఉందా? ఇక చేతికి చిప్పే... అన్నీ కట్

సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుని దేశప్రజల నడ్డివిరిస్తున్న మోడీ సర్కారు.. ఇపుడు తీసుకునే కఠ

బైకు, కారు, ఫ్రిజ్, ఏసీ ఉందా? ఇక చేతికి చిప్పే... అన్నీ కట్
, సోమవారం, 7 ఆగస్టు 2017 (08:53 IST)
సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుని దేశప్రజల నడ్డివిరిస్తున్న మోడీ సర్కారు.. ఇపుడు తీసుకునే కఠిన నిర్ణయం వల్ల ఇక ప్రభుత్వ రాయితీ అనేది ఎండమావికానుంది. నోట్ల రద్దు పేరుతో ఆర్నెల్ల పాటు ప్రజలను అష్టకష్టాలకు గురిచేసింది. ఇపుడు మరో నిర్ణయంతో షాక్‌కు గురిచేయనుంది. 
 
పట్టణాలు, నగరాల్లో నివాసముంటున్న వారికి కారు, ఫ్రిజ్, ఏసీ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు పొందేందుకు అర్హులు కాదంటూ కేంద్రం నియమించిన దేబ్రాయ్ కమిటీ బాంబులాంటి వార్త పేల్చింది. 
 
ముఖ్యంగా, నాలుగు గదుల ఇల్లున్నా, కారు లేదా ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ద్విచక్రవాహనం ఉంటే మీకు సర్కారు సంక్షేమ పథకాల ఫలాలు పొందటానికి అర్హులు కాదంటూ బిబేక్ దెబ్రాయ్ కమిటీ సిఫార్సు చేసింది. తాజాగా జరపనున్న సాంఘీక ఆర్థిక సర్వేలో పట్టణ వాసులకు పైన పేర్కొన్న వస్తువులు ఇంట్లో ఉంటే సంక్షేమ పథకాలు అందవని కమిటీ స్పష్టం చేసింది. 
 
ఇల్లు లేని వారు, పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్ల వారికి, పిల్లలు సంక్షేమ పథకాలు పొందవచ్చని కమిటీ చెప్పింది. మొత్తంమీద పట్టణాల్లో నివాసముంటున్న వారిలో 59 శాతం మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తలకు హెల్మెట్లు ధరించి నిద్రపోతున్న మహిళలు.. ఎందుకు?