Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యోగికి మాత్రమే అనుమతి.. అయోధ్య రామాలయ శంకుస్థాపనపై రామజన్మభూమి ట్రస్టు క్లారిటీ

యోగికి మాత్రమే అనుమతి.. అయోధ్య రామాలయ శంకుస్థాపనపై రామజన్మభూమి ట్రస్టు క్లారిటీ
, బుధవారం, 29 జులై 2020 (15:18 IST)
అయోధ్యలోని రామాలయం భూమి పూజ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మినహా ముఖ్యమంత్రులకు ఆహ్వానం లేదని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాజాగా ప్రకటించింది.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించలేదని విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు.

రామాలయం నిర్మాణం కోసం పోరాడిన కీలకవ్యక్తులైన ఎల్ కె అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, సాథ్వీ రితంబర, మాజీ సీఎం కల్యాణ్ సింగ్, జై భాన్ సింగ్ పోవాయియాలను భూమి పూజ కార్యక్రమానికి రావాలని ట్రస్టు ఆహ్వానించింది.

రామజన్మభూమి కేసును కోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాదులను కూడా ఈ ఆలయ భూమి పూజా కార్యక్రమానికి పిలిచారు.ప్రధాని మోదీ ముఖ్యఅతిధిగా పాల్గొనే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించారు.

15 మంది ఆలయ ట్రస్టు సభ్యులతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కృష్ణ గోపాల్, ఇంద్రేష్ కుమార్, యోగా గురు బాబా రాందేవ్, జగత్ గురు రాంభద్రాచార్య, రాథే రాథే బాబా, యుగ్ పురుష్ ప్రేమానందజీ, విశ్వహిందూపరిషత్ తరపున అలోక్ కుమార్. సదాశివ్ కోక్జే, దినేష్ చంద్ర, ప్రకాష్ శర్మ, భజరంగ్ దళ్ అధ్యక్షుడు మిలింద్ పరాండీ, రాంవిలాస్ వేదాంతి, జితేంద్రనంద్ సరస్వతిలను రామాలయం భూమిపూజా కార్యక్రమానికి ఆహ్వానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి ఫలమూ బీసీలకు అందిస్తా : బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ