Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో ఘాటెక్కిన ఉల్లి.. పెరిగిన బంగాళాదుంప ధర

ఢిల్లీలో ఘాటెక్కిన ఉల్లి.. పెరిగిన బంగాళాదుంప ధర
, సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (08:55 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి, బంగాళాదుంప ధరలు అమాంతం పెరిగాయి. కూరగాయల ధరలు కూడా సామాన్యులు అందుకోలేనంతగా ఆకాశాన్నంటుతోన్నాయి. దీంతో ఉల్లిని కొనాలంటేనే సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

15 రోజుల క్రితం ఉల్లి ధర కిలోకు 20 రూపాయలు పలికితే.. ఇప్పుడు కిలో ఉల్లి రూ.45 కు పలుకుతోంది. దీంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లలోని వంటకాల్లో ఉల్లి వినియోగాన్ని మానేశారు.

ఉల్లికి బదులుగా ఖీరా, క్యారెట్‌ లను ఉపయోగిస్తున్నారు. గుజరాత్‌, బెంగాల్‌, నాసిక్‌ తదితర ప్రాంతాల నుంచి భారీ పరిమాణంలో ఉల్లి దిగుమతి అయితే, వీటి ధరలు తగ్గవచ్చని వ్యాపారులు అంటున్నారు.

గతంలో హోల్‌ సేల్‌ లో కిలో బంగాళాదుంప ఆరు నుంచి ఏడు రూపాయలకు లభించే ఆలూ ప్రస్తుతం రూ.20 కి దొరుకుతోంది.

ఇటీవలి కాలంలో బంగాళాదుంప ఉత్పాదన పెరుగుతోందని, దీని ధర మరింతగా తగ్గవచ్చని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకేం దుక్కలా వున్నా... మార్పుపై మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతా.. సీఎం కేసీఆర్