Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వచ్చే జూన్ నుంచి ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డు’

వచ్చే జూన్ నుంచి ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డు’
, బుధవారం, 4 డిశెంబరు 2019 (06:18 IST)
జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం అర్హులైన లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఆహార ధాన్యాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. దీనికోసం ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని 2020 జూన్ 1 నుంచి అమలు చేయబోతోంది.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మంగళవారం లోక్‌సభకు తెలిపిన వివరాల ప్రకారం... ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులు తమ రేషన్ కార్డును ఉపయోగించి, తమకు అర్హతగల ఆహార ధాన్యాలను దేశంలోని ఏ ప్రాంతంలోని చౌక ధరల దుకాణం నుంచి అయినా పొందవచ్చు.
 
ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళేవారికి ఇబ్బంది లేకుండా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం కోసం ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని రూపొందించారు.

ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా లబ్ధిదారు బయోమెట్రిక్/ఆధార్‌ను ధ్రువీకరించిన తర్వాత ఈ పథకం అందుబాటులోకి వస్తుంది. పూర్తి స్థాయిలో ఈపీఓఎస్ పరికరాలు ఉన్న చౌక ధరల దుకాణాల్లో మాత్రమే ఈ పథకం అమలవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై మెట్రోలో మహిళలు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చు