Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో మరోసారి పెరిగిన కరోనా మృతుల సంఖ్య

దేశంలో మరోసారి పెరిగిన కరోనా మృతుల సంఖ్య
, శుక్రవారం, 9 జులై 2021 (10:27 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,393 కేసులు, 911 మరణాలు వెలుగు చూశాయి. క్రితంరోజుతో పోల్చితే కేసుల్లో 5.4 శాతం తగ్గుదల కనిపించింది. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. అంతకు ముందు రోజు 817 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
 
తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 3.07 కోట్ల మందికిపైగా కరోనా సోకగా..4,05,939 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 17,90,708 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరీక్షల సంఖ్య 42.7కోట్లకు చేరింది.
 
గడిచిన 24 గంటల్లో 44,459 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.98 కోట్లకు చేరాయి. రికవరీ రేటు 97.19 శాతానికి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల సంఖ్య కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి.
 
ప్రస్తుతం 4.58లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.49శాతానికి తగ్గింది. నిన్న 40,23,173 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య..36,89,91,222.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో తొలి జికా వైరస్‌ కేసు