Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

అన్నయ్యా.. అంటూ రాఖీ కట్టేందుకు వెళ్ళింది.. కానీ రక్తపు మడుగులో?

రాఖీ కట్టేందుకు ఎంతో ఆనందంగా అన్నయ్య దగ్గరకు వెళ్లింది. కానీ అక్కడ జరిగిన సంఘటనను చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే...? అన్నా వదినలు రక్తపు మడుగులో పడి వుండటం చూసి పెద్దగా అరిచింది. ఈ ఘటన

Advertiesment
Raksha Bandhan
, మంగళవారం, 8 ఆగస్టు 2017 (09:55 IST)
రాఖీ కట్టేందుకు ఎంతో ఆనందంగా అన్నయ్య దగ్గరకు వెళ్లింది. కానీ అక్కడ జరిగిన సంఘటనను చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే...? అన్నా వదినలు రక్తపు మడుగులో పడి వుండటం చూసి పెద్దగా అరిచింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్ సర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సుష్మా అనే సోదరి తన సోదరుడు సుభాష్ చంద్ర(62) కు రాఖీ కట్టేందుకు వెళ్ళింది. కానీ అక్కడ అన్నావదినలు హత్యచేయబడిన విషయం చూసి షాక్ అయ్యింది. అంతే స్థానికుల సాయంతో పోలీసులకు పిర్యాదు చేసింది. 
 
అటారీ సీనియర్ సెకెండరీ స్కూల్ ప్రిన్సిపల్‌గా సుభాష్ చంద్ర రిటైర్ అయ్యారు. అతని భార్య కమలేష్ రాణి టీచర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వారి ఇద్దరి కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్రను ఎవరు హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  
 
వారి మృతదేహాలను పరిశీలిస్తే వారిని పదునైన ఆయుధాలతో అంతమొందించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్పత్రిలో మహిళ అడ్మిట్.. స్కాన్‌ గదికి తీసుకెళ్లి రేప్.. ఎక్కడ?