Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కబ్జాదారులు గెంటేశారు... పంచాయతీ వత్తాసు పలికింది... మోడీజీ న్యాయం చేయండి

కబ్జాదారుల కారణంగా ఉన్న ఇంటిని కోల్పోయిన ఓ 11 యేళ్ల బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. తమ ఇంటిని కబ్జాదారులు స్వాధీనం చేసుకుని ఇంటిని నిర్మిస్తుంటే గ్రామ పంచాయతీ పెద్దలు వత్తాసు పలుకుతున్

Advertiesment
కబ్జాదారులు గెంటేశారు... పంచాయతీ వత్తాసు పలికింది... మోడీజీ న్యాయం చేయండి
, శనివారం, 10 జూన్ 2017 (09:09 IST)
కబ్జాదారుల కారణంగా ఉన్న ఇంటిని కోల్పోయిన ఓ 11 యేళ్ల బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. తమ ఇంటిని కబ్జాదారులు స్వాధీనం చేసుకుని ఇంటిని నిర్మిస్తుంటే గ్రామ పంచాయతీ పెద్దలు వత్తాసు పలుకుతున్నారనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదనీ, అందువల్ల తమకు న్యాయం చేయాలంటూ ఆ బాలిక ప్రధాని మోడీకి లేఖ రాసింది.
 
ఒడిషా రాష్ట్రంలోని కటక్ జిల్లాలోని పోఖరి గ్రామానికి చెందిన ఉగ్రసేన్ మొహరానా కుమార్తె శుభశ్రీ రాసిన లేఖలోని వివరాలను పరిశీలిస్తే.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరింది. ఏ తప్పు చేయకుండానే తమను ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపారని, తిరిగి ఇంటికి చేరుకునేందుకు సాయం చేయాలని లేఖలో కోరింది.
 
గ్రామస్థులు తన తండ్రిపై దాడి చేయడమే కాకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారని ఆవేదన వ్యక్తంచేసింది. తమ భూమిని అన్యాయంగా లాక్కునేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకే తమపై కక్ష కట్టారని వివరించింది. కబ్జాదారులకు గ్రామ పంచాయతీ పెద్దలు సైతం వత్తాసు పలికారని, దీనిపై డీజీపీ కేబీ సింగ్, ఇతర ఉన్నతాధికారులను కలిసినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రధానికి లేఖ రాసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుణం కావాలా? అయితే, ష్యూరిటీగా నగ్న ఫోటోలు ఇవ్వాలి... ఏ కంపెనీలో?