Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోయలో పడిన బస్సు-9 మంది మృతి, 41మందికి గాయాలు

లోయలో పడిన బస్సు-9 మంది మృతి, 41మందికి గాయాలు
, బుధవారం, 29 జనవరి 2020 (16:02 IST)
ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్‌ పరిధి తప్తపాణి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. సంఘటన స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో 41మంది ప్రయాణీకులు గాయాలకు గురైనట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వారు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియాలో ఐఫోన్ అమ్మకాలకు తగ్గని డిమాండ్-ఆపిల్