Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

Advertiesment
baby boy

సెల్వి

, శనివారం, 31 మే 2025 (19:25 IST)
తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం కారణంగా ఓ నర్స్ నవజాత శిశువు బొటనవేలును కట్ చేసేశారు. మే 24న అడుక్కంపరైలోని ఆసుపత్రిలో ఆ బాలుడు జన్మించాడని తెలిసింది. వెల్లూరు జిల్లాలోని ముల్లిపాళయంకు చెందిన శిశువు తల్లిదండ్రులు విమల్‌రాజ్ (30), నివేత (24) తెలిపిన వివరాల ప్రకారం, ప్రసవం తర్వాత తల్లి, బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు.
 
ట్రిప్స్ ఎక్కించే క్రమంలో శిశువు చేతిలో చొప్పించిన శస్త్రచికిత్స సూదిని మారుస్తున్నప్పుడు నర్సులు బాలుడి బొటనవేలును కట్ చేసేశారని దంపతులు ఆరోపించారు. సూదిని అమర్చిన టేప్‌ను చేతితో తొలగించడానికి బదులుగా, నర్సులు దానిని కత్తెరతో తొలగించడానికి ప్రయత్నించారని దంపతులు ఆరోపించారు. 
 
సూదిని తొలగిస్తుండగా, నర్సులలో ఒకరు నొప్పితో కేకలు వేసిన శిశువు బొటనవేలును నరికివేశారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ దీంతో తల్లిదండ్రులు నర్సులతో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రికి వచ్చిన బాలుడి బంధువులు కూడా వైద్య నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. 
 
శిశువు తల్లిదండ్రులు, బంధువులు వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. నిరసన నేపథ్యంలో, వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి అధికారులు ఈ సంఘటనపై విచారణకు ఆదేశించింది. శిశువును ప్లాస్టిక్ సర్జరీ కోసం అంబులెన్స్ ద్వారా చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువకుడితో వివాహిత రాసలీల: బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి