Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేషనల్ హై వే పైన నవంబరు 18 వరకు టోల్ ఫ్రీ... గడువు పెంచిన గడ్కారీ

న్యూఢిల్లీ : నవంబరు 18 వరకు వాహనదారులు టోల్ ఫీజు కట్టనవసరం లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఎటువంటి రుసుము చెల్లించకుండానే ప్రయాణం చేసే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశంలో కరెన్సీ మార్పిడి నేపథ్యంలో సామాన్య ప్రజలు అవస్థలు పడు

నేషనల్ హై వే పైన నవంబరు 18 వరకు టోల్ ఫ్రీ... గడువు పెంచిన గడ్కారీ
, సోమవారం, 14 నవంబరు 2016 (20:01 IST)
న్యూఢిల్లీ :  నవంబరు 18 వరకు వాహనదారులు టోల్ ఫీజు కట్టనవసరం లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఎటువంటి రుసుము చెల్లించకుండానే ప్రయాణం చేసే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశంలో కరెన్సీ మార్పిడి నేపథ్యంలో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్న దరిమిలా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 
 
500, 1000 నోట్లు రద్దయిన వెంటనే దేశంలో కలకలం రేగింది. ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద చిల్లర లేక, వాహనాలు జామ్ అయిపోయాయి. వెంటనే స్పందించిన కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నవంబరు 14 వరకు టోల్ ఎత్తి వేశారు. కానీ, ఇంకా నోట్ల సర్దుబాటు కాకపోవడంతో ఈ గడువును మరో నాలుగు రోజులు పొడిగించారు. టోల్ గేట్స్ వద్ద నవంబర్ 18 వరకు వాహనదారుల నుండి టోల్ టాక్స్ వసూల్ చేయవద్దని కేంద్ర మంత్రి గడ్కారీ తన ట్విటర్లో తాజాగా తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 1.87 కోట్లు... ఎలా సర్దుకుందాం... పట్టేసిన పోలీసులు....