Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జకీర్ నాయక్‌పై ఎఫ్ఐఆర్.. ముంబైలో ఐఆర్ఎఫ్ సోదాలు...

వివాదాస్పద ముస్లిం మత ప్రబోధకుడు 'పీస్ టీవీ' అధిపతి, జకీర్ నాయక్‌‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. ఉగ్రవాద వ్యతిరేక నిరోధక చట్టాల కింద ఈ కేసును నమోదు చేసింది. తన ప్రసంగాలతో

జకీర్ నాయక్‌పై ఎఫ్ఐఆర్.. ముంబైలో ఐఆర్ఎఫ్ సోదాలు...
, శనివారం, 19 నవంబరు 2016 (10:15 IST)
వివాదాస్పద ముస్లిం మత ప్రబోధకుడు 'పీస్ టీవీ' అధిపతి, జకీర్ నాయక్‌‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. ఉగ్రవాద వ్యతిరేక నిరోధక చట్టాల కింద ఈ కేసును నమోదు చేసింది. తన ప్రసంగాలతో యువతలో ఉగ్రవాద భావనలు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినందునే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, బంగ్లాదేశ్‌లోని ఓ కేఫ్‌పై ఉగ్రవాదులు దాడి చేసి 20 మందికి పైగా పొట్టన బెట్టుకున్న ఘటనలో, ఉగ్రవాదులు జకీర్ ప్రసంగాలతోనే ప్రభావితులైనట్టు వెల్లడైన తర్వాత ఆయనపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు.. ముంబైలోని ఆయనకు చెందిన 10 కేంద్రాలపై కూడా ఐఆర్ఎఫ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ దేశ ప్రథమ మహిళ మేనల్లుళ్లు డ్రగ్స్ దోషులు.. అమెరికా కోర్టు తీర్పు