Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరుగుతున్న అత్యాచారాలకు నెహ్రూ కుటుంబమే కారణం.. మోడీ దైవాంశ సంభూతుడు: బీజేపీ ఎమ్మెల్యే

పెరుగుతున్న అత్యాచారాలకు నెహ్రూ కుటుంబమే కారణం.. మోడీ దైవాంశ సంభూతుడు: బీజేపీ ఎమ్మెల్యే
, మంగళవారం, 24 మే 2016 (19:10 IST)
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహుజా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోగడ.. దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, వేధింపు కేసుల్లో 50 శాతం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయంతెల్సిందే. 
 
ఈ వ్యాఖ్యలు సద్దుమణగక ముందే... ఆయన మరోమారు నోటిదూల ప్రదర్శించారు. భారత్‌లో పెరుగుతున్న అత్యాచార ఘటనలను గాంధీ-నెహ్రూ కుటుంబానికి ఆపాదించారు. దేశంలోని అన్ని సామాజిక సమస్యలకూ నెహ్రూ కుటుంబమే కారణని ఆయన విమర్శించారు. 
 
ఆసక్తికరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దైవాంశ సంభూతిడిగా అహుజా అభివర్ణించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలను ఆయన త్వరలోనే రూపుమాపుతారని అన్నారు. 
 
కాగా, అహుజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ శాఖ మండిపడింది. ఆయనకు పిచ్చి పట్టిందని, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చించాలని వ్యాఖ్యానించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరత్ కుమార్‌కు ఫస్ట్... స్టాలిన్‌కు 16వ వరుస... అలా ఎందుకు కూర్చోబెట్టామంటే.. జయలలిత వివరణ