Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రపతి అభ్యర్థిగా మహాత్మా గాంధీ మనవడు... ప్రధాని మోడీ సమ్మతించేనా?

భారత రాష్ట్రపతి అభ్యర్థి రేసులో మరో కొత్తపేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎవరన్నదానిపై వివిధ రకాలుగా చర్చ సాగుతోంది. అదేసమయంలో బీజేపీ సారథ

Advertiesment
ndia presidential election
, గురువారం, 11 మే 2017 (09:41 IST)
భారత రాష్ట్రపతి అభ్యర్థి రేసులో మరో కొత్తపేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎవరన్నదానిపై వివిధ రకాలుగా చర్చ సాగుతోంది. అదేసమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి లేదా కాంగ్రెస నాయకత్వంలోని యూపీఏలు ఓ స్పష్టమైన నిర్ణయానికి రాలేక పోతున్నాయి. 
 
ఇప్పటికే ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చినా కాసేపటికే మాయం అవుతున్నాయి. తాజాగా మహాత్మాగాంధీ మనవడు, గతంలో దౌత్యవేత్తగా, గవర్నర్‌గా సేవలందించిన గోపాలకృష్ణ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనను దింపాలని యోచిస్తున్న ప్రతిపక్ష నేతలు గోపాలకృష్ణ‌తో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయనను కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అయితే ఈ విషయంలో ఇంతకుమించి పురోగతి లేదని, చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఊహాగానాలు వద్దని సూచించారు. కాగా, గోపాలకృష్ణ గాంధీ, లేకుంటే లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌‌లను బరిలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా గాంధీవైపే మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భానుడి ప్రతాపంతో మూగజీవుల కష్టాలు.. కుక్కర్లో హాయిగా బజ్జున్న నాగరాజు..