Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమితాబ్‌కు పొగాకు సెగ... ఆ ప్రచారం నుంచి తప్పుకోండంటూ లేఖ

అమితాబ్‌కు పొగాకు సెగ... ఆ ప్రచారం నుంచి తప్పుకోండంటూ లేఖ
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (09:54 IST)
బాలీవుడ్ అగ్ర నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు సెగతగిలింది. పాన్ మసాలా ప్రచార ప్రకటన నుంచి వైదొలగాలంటూ నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనేషన్ (జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ) ఘాటైన లేఖను సంధించింది. 
 
పొగాకు, పాన్ మసాలా వ్యసనం పౌరుల ఆరోగ్యాన్ని క్షీణిస్తుందని వైద్య పరిశోధనల్లో తేలిందని, అందువల్ల పాన్ మసాలాలను ప్రోత్సహించే ప్రకటనల ప్రచారం నుంచి వైదొలగాలని కోరుతూ ఈ సంస్థ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ అమితాబ్‌కు లేఖ రాశారు.
 
ఈ లేఖలో... 'అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ అని, అతను వీలైనంత త్వరగా పాన్ మసాలా ప్రకటనల నుంచి తప్పుకోవాలి. పొగాకు వ్యసనం నుంచి యువత దూరంగా ఉండటానికి ఈ చర్య సహాయపడుతుంది' అని పేర్కొన్నారు. 
 
'పాన్ కేన్సర్ కారకంగా పనిచేస్తోందని ఇటీవలి పరిశోధనలో తేలింది, తమలపాకులోని పదార్థాలు శరీరంలో కేన్సర్ కారకాలుగా మారి నోటి కేన్సర్‌కు దారితీస్తాయని తేలింది. పాన్ మానవులకు కేన్సర్ కారకం అనే శాస్త్రీయ ఆధారాలను ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు నిర్దారించాయి' అని బిగ్ బి కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రోల్ ధరల తగ్గింపునకు రాష్ట్రాలు వ్యతిరేకం : హర్దీప్ సింగ్ పురి