Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ విషయంలో మేము ఎవరి మాటను వినం... ప్రధానమంత్రి మోదీ

పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ రేంజిలో కాంగ్రెస్ పార్టీపైన మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తెచ్చింది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందనీ, పార్టీల కోసం కా

ఆ విషయంలో మేము ఎవరి మాటను వినం... ప్రధానమంత్రి మోదీ
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (13:57 IST)
పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ రేంజిలో కాంగ్రెస్ పార్టీపైన మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తెచ్చింది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందనీ, పార్టీల కోసం కాదని అన్నారు. తాము స్వాతంత్ర్య సమరంలో పాల్గొనకపోయినా దేశం కోసమే జీవిస్తున్నామనీ, దేశకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని అన్నారు.
 
లోక్ సభ సమావేశాల్లో ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందని చూస్తే.... కుటుంబ పాలన ఇచ్చిందని తెలుస్తుందన్నారు. బినామీ చట్టం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాన్ని మాత్రం నోటిఫై చేయకుండా మరుగున ఎందుకు పడవేసిందో సమాధానం చెప్పాలన్నారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని నోటిఫై చేశామన్నారు. 
 
దేశంలో అవినీతిపరులు, నల్లధనం వెనుకేసుకుంటున్నవారి దారులను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నామనీ, అందులో భాగంగానే పెద్ద నోట్ల రద్దును అమలు చేశామన్నారు. మన ఆర్థిక వ్యవస్థ బలంగా వుండటమూ, దేశ ప్రజలు తమకు సహకరించడం వల్లనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. దేశాభివృద్ధిని వెనుకకు లాగే సలహాలను, మాటలను తాము పట్టించుకోబోమని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీఎంకే ఎమ్మెల్యేలంతా రాజీనామా? తమిళనాడులో రాష్ట్రపతి పాలన!