ప్రధాని పదవి ఊడినా ఫర్లేదు... దేశం బాగుపడుతుంది... సన్నిహితులతో మోడీ
తాను తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల తన ప్రధానమంత్రి పదవి ఊడిపోయినా ఫర్వాలేదనీ, కానీ దేశం బాగుపడుతుందని తనను కలిసిన సన్నిహితుల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారట.
తాను తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల తన ప్రధానమంత్రి పదవి ఊడిపోయినా ఫర్వాలేదనీ, కానీ దేశం బాగుపడుతుందని తనను కలిసిన సన్నిహితుల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారట.
దేశంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న పెద్ద విలువైన రూ.500, రూ,1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు మోడీ మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ రద్దు కూడా మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఆరోజు జాతినుద్దేశించి ప్రసగించారు.
ఈ ప్రకటన తర్వాత ప్రధాని మోడీని ఆయన సన్నిహితులు పలువురు కలిశారట. విపక్షాలతో పాటు.. స్వపక్షం నుంచి తీవ్రమైన విమర్శలు రావొచ్చని వారంతా ఆందోళన వ్యక్తం చేయగా, దీనికి ప్రధానిగా తనదైనశైలిలో స్పందించారట.
"నేను తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో నా పదవి పోయినా ఫర్వాలేదు. కానీ దేశం బాగుపడుతుంది" అని బదులిచ్చారట. ఈ వివరణ తర్వాత సమయం తీసుకున్న ఆ సన్నిహితులు.. ఇపుడు ప్రధాని నిర్ణయంపై సంపూర్ణ విశ్వాసంతో పాటు.. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారట.