Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందాలను ఎరవేసి 'శ్రీమంతుల' నిలువు దోపిడి.. ఎక్కడ?

యువతుల అందాలను ఎరగా వేసి శ్రీమంతులను దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులోని పచ్చని అందాల మాటను ఈ దోపీడి జరుగుతుండగా, పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్

అందాలను ఎరవేసి 'శ్రీమంతుల' నిలువు దోపిడి.. ఎక్కడ?
, గురువారం, 24 ఆగస్టు 2017 (11:23 IST)
యువతుల అందాలను ఎరగా వేసి శ్రీమంతులను దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులోని పచ్చని అందాల మాటను ఈ దోపీడి జరుగుతుండగా, పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరులోని పర్యాటక అందాలను చూసేందుకు ఎవరైనా కారులో ఒంటరిగా వస్తున్నారంటే వారిని దోచుకునేందుకు ఓ ముఠా పక్కా ప్రణాళికను రూపొందిస్తుంది. ఎవరిని.. ఎక్కడ.. ఎలా నమ్మించి వంచించాలో ఆ విధంగా అందమైన అమ్మాయిలను ఎరగా వేస్తారు. అలా ఎరవేసే ‘అందాల’ దోపిడీ ముఠాను చివరికి రక్షకులు కటకటాల వెనక్కి నెట్టారు. 
 
యువతిని అడ్డుపెట్టుకుని శ్రీమంతులను దోపిడీ చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మైసూరు నగరానికి సమీపంలోని నంజనగూడు వద్ద మైసూరు - ఊటీ వెళ్లే పర్యాటకుల్ని ముందుగా యువతి తన వయ్యారాలతో నిలిపేది. 
 
ఆ తర్వాత ఇతర ముఠా సభ్యులు దోపిడీకి పాల్పడేవారని త‌మ విచార‌ణ‌లో తేలిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, యువతితో పాటు.. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనుషులను తిని అలసిపోయాను.. అరెస్టు చేయండి!