Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిఫిన్ చేసేందుకు ఇంటికొచ్చి.. కోర్కె తీర్చలేదని స్నేహితుడి భార్యనే కడతేర్చిన పేయింగ్ గెస్ట్..

ముంబైలో దారుణం జరిగింది. టిఫిన్ చేసేందుకు ఇంటికొచ్చిన ఓ యువకుడు... కోర్కె తీర్చలేదని స్నేహితుడి భార్యనే కడతేర్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... పాల్ఘార్‌కు చెందిన 23 యేళ్ల హితేష

టిఫిన్ చేసేందుకు ఇంటికొచ్చి.. కోర్కె తీర్చలేదని స్నేహితుడి భార్యనే కడతేర్చిన పేయింగ్ గెస్ట్..
, సోమవారం, 15 మే 2017 (10:22 IST)
ముంబైలో దారుణం జరిగింది. టిఫిన్ చేసేందుకు ఇంటికొచ్చిన ఓ యువకుడు... కోర్కె తీర్చలేదని స్నేహితుడి భార్యనే కడతేర్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... పాల్ఘార్‌కు చెందిన 23 యేళ్ల హితేష్ కార్తక్ పాండీ ఉద్యోగ వేటలో దక్షిణ ముంబైలోని కొలబా ప్రాంతానికి వచ్చి అక్కడి ఓ అపార్టుమెంటులో అద్దెకు దిగాడు. అదే అపార్టుమెంట్‌లో శ్వేతా టాండేల్ అనే 28 వివాహిత తన భర్త మహేంద్రతో మొదటి అంతస్తులో నివాసముంటోంది. మహేంద్ర సోదరుడు హితేష్... కార్తక్ పాండీ గదిలో కలిసి నివాసముంటుండటంతో అతనికి వీరి కుటుంబంతో పరిచయం ఏర్పడింది. 
 
అదేసమయంలో హితేష్ పెయిడ్ గెస్ట్‌గా మహేంద్ర ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు. ఈ నెల పదో తేదీన మహేంద్ర తన సోదరుడితో కలిసి పనిమీద బయటకు వెళ్లాడు. దీంతో హితేష్ టిఫిన్ చేసేందుకు మహేంద్ర ఇంటికి వచ్చాడు. ఆసమయంలో శ్వేతా ఒక్కటే ఇంట్లో ఉన్నది. దీంతో తన కోర్కె తీర్చాలని బలవంతం చేశాడు. దాన్ని తిరస్కరించిన శ్వేతా.. హితేష్‌తో పెనుగులాడుతూ అరిచేందుకు ప్రయత్నించింది. 
 
దీంతో తన బండారం బయటపడుతుందని హితేష్ వంటగదిలోని కత్తి తీసుకొని శ్వేత గొంతు కోసి చంపాడు. అనంతరం తన గదికి వెళ్లి స్నానం చేసి ఏమీ తెలియనట్లు పనిపై బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లి వచ్చిన మహేంద్ర రక్తపు మడుగులో శ్వేత పడి ఉండటం చూసి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి.. హితేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య మెడకు రిబ్బన్‌ బిగించి ప్రాణాలు తీశాడు.. ఇంటి వెనుకనే పాతిపెట్టిన భర్త