Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్నింగ్ వాక్‌కు వెళ్తే కొబ్బరి చెట్టు పడింది.. దూరదర్శన్ మాజీ యాంకర్ మృతి..

దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ నాథ్ (58)ను ఓ కొబ్బరి చెట్టు పొట్టనబెట్టుకుంది. ముంబైలో అనూహ్య ప్రమాదం జరగడంతో కంచన్ నాథ్ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ నాథ్‌(58

మార్నింగ్ వాక్‌కు వెళ్తే కొబ్బరి చెట్టు పడింది.. దూరదర్శన్ మాజీ యాంకర్ మృతి..
, శనివారం, 22 జులై 2017 (15:04 IST)
దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ నాథ్ (58)ను ఓ కొబ్బరి చెట్టు పొట్టనబెట్టుకుంది. ముంబైలో అనూహ్య ప్రమాదం జరగడంతో కంచన్ నాథ్ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ నాథ్‌(58) ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ వెళ్లారు. 
 
ఆ సమయంలో ఇంటికి సమీపంలోని కొబ్బరి చెట్టు అకస్మాత్తుగా విరిగిపడింది. దీంతో తీవ్ర గాయాలతో అకస్మారక స్థితిలోకి జారుకున్న కంచన్ శుక్రవారం ఉదయం కన్ను మూశారు. స్థానిక సీటీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ విషాదంపై ఆమె కుటుంబ సభ్యులు ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 
 
ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఈ చెట్టును తొలగించాల్సిందిగా అవినాష్ అనే వ్యక్తి దరఖాస్తుతో పాటు రూ.1,380 డిపాజిట్ కూడా చేశాడని, ఇంకా స్థానిక కౌన్సిలర్ ఆషా మరాథే బీఎంసీ లేఖ రాసినా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించారని కంచన్ భర్త ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాస్టల్ వార్డెన్ ఓవరాక్షన్... విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టి... నెలసరి పరీక్షలు