Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్నతల్లిని పీక కోసి చంపి.. రక్తాక్షరాలు రాసిన తనయుడు.. ఎక్కడ?

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును విచారిస్తున్న ముంబై ప్రత్యేక పోలీసు బృందంలో ఉన్న ఓ అధికారి భార్య ఇటీవల తన ఇంట్లో అనుమానాస్పదరీతిలో హత్యకు గురైంది. ఈ కేసులో తనయుడే కాలయముడయ్యాడు. దీంతో అ

కన్నతల్లిని పీక కోసి చంపి.. రక్తాక్షరాలు రాసిన తనయుడు.. ఎక్కడ?
, శుక్రవారం, 26 మే 2017 (12:03 IST)
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును విచారిస్తున్న ముంబై ప్రత్యేక పోలీసు బృందంలో ఉన్న ఓ అధికారి భార్య ఇటీవల తన ఇంట్లో అనుమానాస్పదరీతిలో హత్యకు గురైంది. ఈ కేసులో తనయుడే కాలయముడయ్యాడు. దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిని హత్య చేసిన ఆ రాక్షసుడు.. ఇంట్లోనే రక్తాక్షరాలు రాశాడు. ఇలా ఎందుకు చేశాడో ఎవరికీ అంతుచిక్కడం లేదు. 
 
అతని పేరు సిద్ధాంత్. ముంబైలోని ఓ ప్రముఖ కాలేజిలో ఇంజనీరింగ్ చదువును సగంలో ఆపేశాడు. గత రెండు నెలలుగా ఎవరితోనూ పెద్దగా కలవడం లేదని, అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండట్లేదని అతడి స్నేహితులు తెలిపారు. 
 
ఈ క్రమంలో ఇటీవల తన తల్లి దీపాలి పీక కోసి చంపేశాడు. ఆమె రక్తంతో ఇంట్లో నేలమీద ఒక స్మైలీ వేయడంతో పాటు.. ''ఆమె అంటే విసుగెత్తిపోయింది. నన్ను పట్టుకుని ఉరితీయండి'' అని రాశాడు. కన్నతల్లిని పీక కోసి, కత్తితో నాలుగైదు సార్లు పొడిచి మరీ చంపినట్టు ఆ కసాయి వెల్లడించాడు.
 
హత్య తర్వాత రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు పారిపోయిన సిద్ధాంత్‌ను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. ముంబై నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. అక్కడి హోటల్లో ఉండగా విశ్వసనీయంగా సమాచారం అంది పోలీసులు వెళ్లడంతో సిద్ధాంత్ దొరికిపోయాడు. అయితే, తల్లిని ఎందుకు అంత పాశవికంగా హత్య చేశాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పందికూర లేటుగా వండిందని.. కిరోసిన్ పోసి.. నిప్పంటించబోయాడు.. ఇంతలో?