Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో దారుణం : చెత్త ఏరుకునే బాలికపై గ్యాంగ్ రేప్... ఆ తర్వాత...

దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాల కేంద్రంగా మారిపోతోంది. ఇక్కడ మహిళల మానప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదని పలు స్వచ్చంధ సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.

ఢిల్లీలో దారుణం : చెత్త ఏరుకునే బాలికపై గ్యాంగ్ రేప్... ఆ తర్వాత...
, బుధవారం, 11 జనవరి 2017 (10:37 IST)
దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాల కేంద్రంగా మారిపోతోంది. ఇక్కడ మహిళల మానప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదని పలు స్వచ్చంధ సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత గర్భందాల్చిన ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణానికి ఇద్దరు కామాంధులు పాల్పడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ నగరంలోని మయూర్ విహార్ వీధిలో ఫుట్‌పాత్‌పై చెత్త ఏరుకొని జీవనం సాగిస్తున్న 16 ఏళ్ల ఓ బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పి కాన్పు చేశారు. ఆ బాలిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 
 
పోలీసులు బాలికను ప్రశ్నించగా కొన్నాళ్ల క్రితం తనపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారని చెప్పింది. దీంతో అత్యాచారం చేసిన యువకుల కోసం పోలీసులు గాలింపు ఆరంభించారు. బాధితురాలైన బాలికకు కౌన్సెలింగ్ చేసి, ఆమెకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించేందుకు యత్నిస్తున్నామని డీసీసీ ఓంవీర్ సింగ్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసుస్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. జెన్‌ఫోన్ 3 జామ్ పేరుతో వచ్చేస్తోంది..