Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరప్రదేశ్‌లో దారుణం... భార్యను కాల్చి చంపిన బీజేపీ నేత.. పరారీ

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత భార్యను కాల్చి చంపారు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... యూపీలోని మీరట్‌కు చెందిన బీజేపీ నాయకుడు కులదీప్‌ తోమర్‌ తన భార్య

ఉత్తరప్రదేశ్‌లో దారుణం... భార్యను కాల్చి చంపిన బీజేపీ నేత.. పరారీ
, ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (10:07 IST)
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత భార్యను కాల్చి చంపారు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... యూపీలోని మీరట్‌కు చెందిన బీజేపీ నాయకుడు కులదీప్‌ తోమర్‌ తన భార్య పూనమ్‌తో తొలుత గొడవపడ్డాడు.
 
ఆ తర్వాత విపరీతంగా తిట్టుకున్నారు. తొలుత చేయి చేసుకున్న ఆయన అనంతరం తన దగ్గర ఉన్న తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. అనంతరం తనకు తుపాకీ ఎక్కుపెట్టుకొని కాల్చుకోబోతుండగా ఇంట్లో మేనళ్లుడు వచ్చి అడ్డుకున్నాడు. 
 
పూనమ్‌ను ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే, భార్య చనిపోయిందనే భయంతో ప్రస్తుతం కులదీప్‌ పరారీలో ఉన్నాడు. మొత్తం ఆయన కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అండగా ఉన్న స్పీకర్‌పై దాడి చేస్తున్నా... ఆవేశం తన్నుకొస్తున్నా... నిశ్చేష్టుడై చూసిన ఓపీఎస్