Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో 4 వేల మంది మృతి - కొత్త కేసులు 4 లక్షలు

Advertiesment
దేశంలో 4 వేల మంది మృతి - కొత్త కేసులు 4 లక్షలు
, ఆదివారం, 9 మే 2021 (10:27 IST)
దేశంలో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. శనివారం కొత్త‌గా 4,03,738  మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... శనివారం 3,86,444 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,96,414కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 4,092 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,42,362కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,83,17,404 మంది కోలుకున్నారు. 37,36,648 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 16,94,39,663 మందికి వ్యాక్సిన్లు వేశారు. 
 
కాగా, దేశంలో శనివారం వరకు మొత్తం 30,22,75,471 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,65,428 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కానిస్టేబుల్‌లో మహిళా ఎస్ఐ సన్నిహితం... ఇద్దరూ సూసైడ్ అటెంప్ట్.. ఎక్కడ?