Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జల్లికట్టు ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాల్ చేయొచ్చు.. కానీ ఆందోళన వద్దు : ఖట్జూ

జల్లికట్టు ఆందోళనకారుల్లో తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై నెలకొన్న భయాందోళనలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ నివృత్తి చేసేపనిలో పడ్డారు. ఇదే అంశంపై ఆయన తన ఫేస్‌బుక్‌లో ఓ

జల్లికట్టు ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాల్ చేయొచ్చు.. కానీ ఆందోళన వద్దు : ఖట్జూ
, ఆదివారం, 22 జనవరి 2017 (15:06 IST)
జల్లికట్టు ఆందోళనకారుల్లో తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై నెలకొన్న భయాందోళనలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ నివృత్తి చేసేపనిలో పడ్డారు. ఇదే అంశంపై ఆయన తన ఫేస్‌బుక్‌లో ఓ ట్వీట్ చేశారు. 
 
జల్లికట్టును నిర్వహించేందుకు అనుమతినిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ తాత్కాలికమైనదే. అయితే, దీనిపై గవర్నర్ సంతకం చేసి ఆమోదముద్ర వేశారు. అయినా ఈ ఆర్డినెన్స్ తాత్కాలికమైనదనడం నిజమేనని జస్టిస్ కట్జూ చెప్పారు. అయితే తమిళనాడు శాసనసభ సోమవారం సమావేశం కాబోతోందని, ఈ ఆర్డినెన్స్ స్థానంలో చట్టాన్ని ఆమోదిస్తుందని, అది శాశ్వతమైనదవుతుందని తెలిపారు. 
 
ఈ విధంగా చేసిన చట్టంపై కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని, అయితే ఇది విజయవంతం కాకపోవచ్చునని తెలిపారు. దీనికి కారణం రాజ్యాంగంలోని అధికరణ 254(2) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం లభించడమేనని పేర్కొన్నారు. అందువల్ల జల్లికట్టు మద్దతుదార్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిరాఖండ్ రైలు ప్రమాదం వెనుక మావోల హస్తం.. 36కు చేరిన మృతులు