Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మణిపూర్‌లో మళ్లీ హింస.. ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్.. హత్య..ప్రభుత్వంపై విమర్శలు

manipur students
, మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (11:03 IST)
మణిపూర్‌లో ఇంకా హింస కొనసాగుతోంది. అక్కడ ప్రశాంత వాతావరణం చోటుచేసుకోవట్లేదు. మణిపూర్‌లో మహిళల ఘటన మరవకముందే.. జూలైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. మెయిటీ తెగకు చెందిన ఇద్దరు విద్యార్థులు.. హిజమ్ లింతోయింగంబి (17), ఫిజమ్ హెమిజిట్ (20) ఓ అటవీ క్యాంపులో గడ్డిపై కూర్చుండగా వెనక సాయుధులు నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
మరో ఫొటోలో వారిద్దరూ చనిపోయి నేలపై పడి ఉన్నారు. ఈ ఫొటోలు వెలుగులోకి రావడంతో మరోమారు నిరసనలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్ర సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఈ హత్యపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వేగంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని తెలిపింది. విద్యార్థుల కిడ్నాప్, హత్య వెనక ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారులో ఎయిర్‌బ్యాగులు మిస్సింగ్.. ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు