Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయలేదనీ మేడపై నుంచి తోసేసిన భర్త... ఎక్కడ?

ఎంతో సంతోషంతో వివాహ వేడుకకు వెళ్లిన ఓ వివాహిత.. చివరకు శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయి ఆస్పత్రిపాలైంది. దీనికి కారణం ఆమె భర్తే కావడం గమనార్హం. వివాహ వేడుకలో తనతో కలిసి డ్యాన్స్ చేయలేదన్న కోపంతో మేడపై న

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయలేదనీ మేడపై నుంచి తోసేసిన భర్త... ఎక్కడ?
, బుధవారం, 17 మే 2017 (09:05 IST)
ఎంతో సంతోషంతో వివాహ వేడుకకు వెళ్లిన ఓ వివాహిత.. చివరకు శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయి ఆస్పత్రిపాలైంది. దీనికి కారణం ఆమె భర్తే కావడం గమనార్హం. వివాహ వేడుకలో తనతో కలిసి డ్యాన్స్ చేయలేదన్న కోపంతో మేడపై నుంచి భార్యను కిందికి తోసేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లా చిల్లాఘాట్ పట్టణ సమీపంలోని డిఘ్వాట్ గ్రామంలో జరుగుతున్న తన బంధువుల పెళ్లికి విశాఖ తివారీ (28) అనే మ‌హిళ తన భర్తతో కలిసి వెళ్లింది. ఈ పెళ్లి వేడుక‌లో 'కలేవా' అనే తంతు జరుగుతోంది. ఈ వేడుక‌లో అంతా డ్యాన్స్ చేస్తున్నారు. విశాఖ భ‌ర్త అజయ్ ఇతర అతిథులతోను కలిసి డాన్సు చేస్తున్నాడు.
 
త‌న భార్య విశాఖ కూడా డ్యాన్స్ చేయాలని ఆమెను కోరాడు. అయితే, ఆమె డ్యాన్స్ చేయ‌డానికి అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన భర్త.. ఆమెను మేడ మీద నుంచి కింద‌రు తోసేశాడు. దీంతో విశాఖకు రెండు కాళ్లు విరిగిపోయాయి. అంతేకాక‌, ఆమె తలకు, ఉదరభాగంలోను కూడా గాయాలయ్యాయి. ఆమె ప్ర‌స్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. 
 
ఈ కేసులో పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. భార్యను కిందకి తోసే సమయంలో భ‌ర్త మ‌ద్యంతాగి ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పెళ్లి వేడుకలో ఒక్కసారి విషాదం నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిజిటల్ ఇండియా... డిజిటల్ ఇండియా అన్నారు... ఇప్పుడేమైంది... గుజరాత్ గుల్లవుతోంది...