Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓ మహిళ కోసం రంజాన్ ఉపవాసాన్ని వదిలేశాడు..

ఓ మహిళ కోసం రంజాన్ ఉపవాసాన్ని వదిలేశాడు..
, గురువారం, 30 మే 2019 (15:41 IST)
మతం కంటే మానవత్వం గొప్పదని ఓ వ్యక్తి నిరూపించాడు. సమాజంలో నీతి, నిజాయితీలు ఇంకా చావలేదని నిరూపిస్తూ, విలువలు ఇంకా బతికే ఉన్నాయనే దానికి తాజాగా జరిగిన ఓ సంఘటన రుజువు చేసింది. ఓ ముస్లిం వ్యక్తి మరో వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షను కూడా వదిలేశాడు. 
 
అత్యవసర పరిస్థితులలో ఉన్నటువంటి ఓ గర్భిణీ మహిళకు సహాయం చేయడానికి రాజస్థాన్‌కి చెందిన ఆ వ్యక్తి తన ఉపవాసాన్ని కూడా లెక్కచేయలేదు. సావిత్రి దేవి ఓ గర్భిణి. ఆమెకు అత్యవసరంగా రక్తం అవసరపడడంతో అష్రఫ్ ఖాన్ అనే వ్యక్తి తన మతానికి సంబంధించి పవిత్రమైన ఆచారాన్ని కూడా వదిలేసి రక్తాన్ని దానం చేశాడు. 
 
తమకు తెలిసినవారికి ఎవరికో బి నెగిటివ్ రక్తం కావాలంటూ వచ్చిన ఓ మెసేజ్ చూసిన అష్రఫ్ ఖాన్ వెంటనే స్పందించాడు. మెసేజ్‌లో అందించబడిన నంబర్ చూసి సదరు వ్యక్తికి కాల్ చేశాడు. అనంతరం పేషెంట్ ఉన్న ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశాడు. ప్రస్తుతం అష్రఫ్ చేసిన పనికి గానూ సమాజంలో ఆదర్శంగా నిలిచాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భావోద్వేగానికి గురైన విజయమ్మ... అమ్మ కన్నీరు తుడిచిన జగన్