Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kerala: మహిళను నిప్పంటించి హత్య.. నిందితుడు కూడా మృతి.. ఎలా?

Advertiesment
crime news

సెల్వి

, శనివారం, 23 ఆగస్టు 2025 (11:16 IST)
మూడు రోజుల క్రితం ఉత్తర కేరళ జిల్లాలో ఒక మహిళను నిప్పంటించి హత్య చేసిన 40 ఏళ్ల వ్యక్తి శనివారం ఆ దాడిలో కాలిన గాయాలతో మరణించాడని పోలీసులు తెలిపారు. మృతుడు కన్నూర్ జిల్లాలోని ఇరిక్కూర్ సమీపంలోని కుట్టవుకు చెందిన జిజేష్‌గా గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే, కన్నూర్ జిల్లాలోని కుట్టియత్తూరులోని ఉరువాంచల్‌కు చెందిన అజీష్ భార్య ప్రవీణ (39)ను ఆగస్టు 20న జిజేష్ తన ఇంట్లో నిప్పంటించాడు. తరువాత ఆమె ఆగస్టు 21న ఆసుపత్రిలో మరణించింది. ఈ ఘటనలో జిజేష్ కూడా తీవ్రంగా కాలిన గాయాలతో శనివారం పరియారంలోని కన్నూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించాడని ఆసుపత్రి అధికారులు తెలిపారు. 
 
జిజేష్, ప్రవీణలు పరిచయస్తులని పోలీసులు తెలిపారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా వారికి పరిచయం లేదు. ప్రవీణను హత్య చేసి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో జిజేష్ ఆ ఇంటికి చేరుకున్నాడని అనుమానిస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. 
 
సంఘటన జరిగిన సమయంలో ప్రవీణ మామ, అత్త, వదిన పిల్లలు ఇంట్లో ఉన్నారని స్థానికులు తెలిపారు. ప్రవీణ్ భర్త అజీష్ విదేశాల్లో ఉన్నాడు. ప్రవీణ మరణం తర్వాత, పోలీసులు జిజేష్ పై హత్య కేసు నమోదు చేశారని మాయిల్ పోలీస్ స్టేషన్ లోని ఒక పోలీసు అధికారి తెలిపారు. శనివారం పోస్ట్ మార్టం తర్వాత జిజేష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Isro: భారతీయ అంతరిక్ష్ స్టేషన్ మాడ్యుల్ నమూనా ప్రారంభించిన ఇస్రో