Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్షయ తృతీయ: జాతిపిత గాంధీజీ బొమ్మతో బంగారం నాణేలు!

Advertiesment
Mahatma Gandhi's face on gold coins
, శనివారం, 7 మే 2016 (20:14 IST)
అక్షయ తృతీయను అందరూ ఘనంగా జరుపుకొంటారు. ఆరోజు స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని విశ్వాసం. అలాంటి అక్షయ తృతీయను పురస్కరించుకుని జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మతో కూడిన బంగారు నాణేలను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.
 
ఓ వైపు మహాత్ముడి బొమ్మ, మరోవైపు జాతీయ చిహ్నమైన అశోక చక్రం బొమ్మతో కూడిన మహాత్మా గాంధీ బంగారు నాణేలను విడుదల చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 24 క్యారెట్లు స్వచ్ఛత కలిగిన బంగారంతో తయారు చేసిన వీటిపై బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ఉంటుంది.
 
ఇదిలా ఉంటే.. అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం కొనుగోళ్లు భారీగా పుంజుకుంటాయి. అయితే ఈసారి ఆ పరిస్థితులేమీ కనబడట్లేదు. పసిడి ధరలు అంచనాలకుమించి పుంజుకుంటున్న నేపథ్యంలో ఈసారి కొనుగోలు దారులు పెద్దగా ఆసక్తి చూపే అవకాశాలు కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాయలసీమను సస్యశ్యామలం చేస్తా.. తోక జాడిస్తే కట్ చేస్తా: చంద్రబాబు