Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బయోరా సిటీ బస్టాండులో గ్యాంగ్ రేప్

బయోరా సిటీ బస్టాండులో గ్యాంగ్ రేప్
, శుక్రవారం, 27 డిశెంబరు 2019 (16:06 IST)
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బయోరా సిటీ బస్టాండ్‌లోని బస్సులో అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇద్దరు వ్యక్తులు బస్సులోకి లాక్కెళ్లి తనపై అత్యాచారం చేశారని బాలిక స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పోలీస్ డివిజనల్ ఆఫీసర్ ఎన్‌కె నహార్ తెలిపాడు. 
 
ఉత్తర ప్రదేశ్‌లో మూడు వేర్వేరు ప్రదేశాల్లో బాలికలపై అఘాయిత్యాలు జరిగాయి. ఈతా జిల్లా జైతారా ప్రాంతంలో బాలికపై ముగ్గరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మోరదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో సదరు బాలిక స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని ఎఎస్‌పి దీపక్ భుకర్ తెలిపాడు. అమ్రోహ జిల్లాలో హసన్‌పూర్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక తనపై మద్రాసా నిర్వహకుడు అత్యాచారం చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎఎస్‌పి అజయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇరిగేషన్ పనులకు రూ.లక్ష కోట్లు కేటాయింపు : ఆదాల ప్రభాకర్ రెడ్డి