Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగాళాఖాతంలో అల్పపీడనం!

బంగాళాఖాతంలో అల్పపీడనం!
, గురువారం, 1 అక్టోబరు 2020 (10:02 IST)
వాయవ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాలు, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలు, హర్యానా, చండీగడ్‌, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, యుపిలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఉపశమించాయి. కానీ మరో రెండు రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

ఎగువ నుండి కురుస్తోన్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులకు వరద పెరిగింది. జూరాల, శ్రీశైలం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సూర్యారావుపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద ఆగడం లేదు. దీంతో భారీగా నీటికి కిందికి వదులుతున్నారు. డిండి, మూసీ ప్రాజెక్టుల్లోనూ భారీగా నీరు చేరింది.

భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. పంటలు దెబ్బతినడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. నిర్మల్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీపీఎం నేత బాబూరావు హౌస్‌ అరెస్ట్‌