Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్వారంటైన్‌లోనే వివాహం.. ప్రేమికులు అలా ఒక్కటయ్యారు..

క్వారంటైన్‌లోనే వివాహం.. ప్రేమికులు అలా ఒక్కటయ్యారు..
, గురువారం, 28 మే 2020 (14:53 IST)
ఇద్దరు ప్రేమికులు క్వారంటైన్‌లోనే వివాహం చేసుకున్నారు. కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ పెళ్లి వేదికగా మారిపోయింది. ఈ వేదికలో ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నారు. నిర్వాహకులుగా ఉన్న టీచర్లు, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు పెళ్లి పెద్దలుగా మారిపోయారు. ఈ అరుదైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని సాగాడ గ్రామంలో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. సౌరబ్ దాస్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన పింకీరాణినితో ప్రేమలో పడ్డారు. ఇంట్లో చెప్పకుండా ఈ ఏడాది జనవరిలో అహ్మదాబాద్ నగరానికి పారిపోయారు.
 
అక్కడే ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేస్తూ ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. లాక్ డౌన్ సమయంలో పరిశ్రమ మూసివేయడంతో ప్రేమికుల జంట ఎంతో కష్టనష్టాలు పడి సాగాడ గ్రామానికి తిరిగివచ్చింది. దీంతో వారిని అధికారులు క్వారంటైన్ చేశారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నతర్వాత క్వారంటైన్ నిర్వాహకులే వారికి వివాహం చేశారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుడు, ఆశా కార్మికుడు, అంగన్ వాడీ వర్కర్లు ఈ ప్రేమ జంటను ఆశీర్వదించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లేచిపోయిన ప్రేమజంట... గర్భందాల్చడంతో క్వారంటైన్‍‌లోనే పెళ్లి