Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ విఫలం.. బైక్ దొంగలించారని కేసు పెట్టారు.. పురుగుల మందు తాగేశాడు..

నల్గొండ జిల్లాలో ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గానుగుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నేరళ్ల రఘు

ప్రేమ విఫలం.. బైక్ దొంగలించారని కేసు పెట్టారు.. పురుగుల మందు తాగేశాడు..
, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (10:10 IST)
నల్గొండ జిల్లాలో ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గానుగుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నేరళ్ల రఘు పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరువురి కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్ళికి నిరాకరించారు. 
 
ఇటీవల ప్రేయసిని కలిసేందుకు రఘు గుడిపల్లి గ్రామానికి వెళ్లాడు. అదే సమయంలో తమ ద్విచక్ర వాహనం కనిపించడంలేదని అమ్మాయి తరుపు బంధువులు గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పదస్థితిలో రఘును పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలేశారు. దీంతో మనస్తాపం చెందిన అతను పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
చికిత్స నిమిత్తం రఘును నల్లగొండ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రఘు మరణించాడు. ఈ విషయమై మృతుడి సోదరుడు రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్మనెంట్ గవర్నర్ లేదు.. గవర్నమెంటూ లేదు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: విజయ్‌కాంత్