జయమ్మకు గుండెపోటు.. అర్థరాత్రే అత్యవసర వస్తువుల కొనుగోలు.. రాష్ట్రపతి ట్విట్టర్లో ఏమన్నారు?
తమిళనాడు సీఎం జయలలిత గుండెపోటుకు గురైయ్యారు. దీంతో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జయమ్మ ఆరోగ్యపరిస్థితిని తెలుసుకునేందుకు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమాన
తమిళనాడు సీఎం జయలలిత గుండెపోటుకు గురైయ్యారు. దీంతో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జయమ్మ ఆరోగ్యపరిస్థితిని తెలుసుకునేందుకు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు ఆసుపత్రి ప్రవేశద్వారం వద్దకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభిమానులు బారికేడ్లనుతోసుకొని ముందుకెళ్లారు.
ఇంకా తమిళనాడులో అర్థరాత్రి పూటే అమ్మకు గుండెపోటు వార్త విని అత్యావసర వస్తువులను కొనుగోలు చేసే ప్రజల సంఖ్య పెరిగింది. పాలు, కూరగాయలు వంటి వాటిని కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ముందస్తు చర్యగా అత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేగంగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ట్విటర్ ఖాతాలో సందేశం ఉంచారు. ఆమె అనారోగ్యానికి గురికావడంపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తన సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు ఆమె అభిమానులు కార్యకర్తలు అమ్మ కోసం పూజలు చేస్తున్నారు.