Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

Advertiesment
Kota student

సెల్వి

, శుక్రవారం, 24 అక్టోబరు 2025 (21:54 IST)
కోటా మెడికల్ కాలేజీలో 21 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కోటలోని నయాపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకాశవాణి కాలనీలో జరిగిందని శుక్రవారం అధికారులు తెలిపారు. మృతురాలు ప్రాచి మీనా (21) మూడో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమె తన తండ్రి కమల్ ప్రసాద్, ముగ్గురు తోబుట్టువులతో ప్రభుత్వ క్వార్టర్‌లో నివసించిందని ఆయన చెప్పారు.
 
ఆమె తల్లి కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది, అప్పటి నుండి ప్రాచి తన చదువు కొనసాగిస్తూ కోటాలో తన కుటుంబంతో నివసిస్తోంది అని ఎస్‌హెచ్‌ఓ కుమార్ తెలిపారు. ప్రాచి వైద్య పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటి నుండి తీవ్ర మనస్తాపానికి గురైందని, గత కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్‌లో ఉందని ఆమె తండ్రి కమల్ ప్రసాద్ చెప్పారని ఆయన తెలిపారు.

గురువారం, ఆమె అక్క మరొక గదిలో ఇంట్లో ఉండగా, ప్రాచి తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కుమార్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్యకు కారణం చదువులో వైఫల్యమే కారణమని కుమార్ తెలిపారు. ఇక గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు