Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరుగుదొడ్డి లేదా అయితే ఉచిత బియ్యం కోత : కిరణ్ బేడీ

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ (ఎల్జీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్న దేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ తీసుకునే నిర్ణయాలు సంచలనాత్మకంగా మారుతున్నాయి. ఎల్జీ హోదాలో ఆమె కీలక నిర్ణయాలు తీసుకుంటున్న

Advertiesment
Kiran Bedi
, ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (12:44 IST)
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ (ఎల్జీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్న దేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ తీసుకునే నిర్ణయాలు సంచలనాత్మకంగా మారుతున్నాయి. ఎల్జీ హోదాలో ఆమె కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
 
ఇందులోభాగంగా, బహిరంగ మలవిసర్జన రహిత, పరిశుభ్రమైన గ్రామాలకే ఉచిత బియ్యం అందించాలని ఆమె శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇవి వివాదాస్పదమయ్యాయి. ఆమె కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
ఫలానా గ్రామం చెత్త రహిత, బహిరంగ మల విసర్జన రహితమని మే 31 లోగా స్థానిక ప్రజాప్రతినిధితోపాటు పంచాయతీ అధికారి నుంచి పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ వస్తేనే అక్కడ ఉచిత బియ్యం పథకం అమలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం నిరంకుంశంగా ఉందని అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కిరణ్‌ బేడి తన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలి గాయానికి చికిత్స చేయమని ఆస్పత్రికెళితే... కాటికి పంపిన వైద్యులు.. ఎక్కడ?