Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్ఫీ కోసం వచ్చి 15 మంది యువకుల వికృత చేష్టలు.. బాధితురాలు ఎవరో తెలుసా?

కర్ణాటక టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో కబ్బన్ పార్కులో క్లబ్ వేడుకలు జరుగగా, డిప్యూటీ డైరక్టర్ తన భార్యతో కలసి హాజరయ్యారు. భోజనం చేసేందుకు ఆయన వెళ్లిన వేళ, 15 మంది యువకులు వచ్చి, సెల్ఫీలు తీసుకుందామని చెబ

Advertiesment
#Karnataka #tennis #academy #crime #news
, బుధవారం, 11 జనవరి 2017 (12:01 IST)
కర్ణాటక టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో కబ్బన్ పార్కులో క్లబ్ వేడుకలు జరుగగా, డిప్యూటీ డైరక్టర్ తన భార్యతో కలసి హాజరయ్యారు. భోజనం చేసేందుకు ఆయన వెళ్లిన వేళ, 15 మంది యువకులు వచ్చి, సెల్ఫీలు తీసుకుందామని చెబుతూ, బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించారు. పూటుగా తాగి ఆమెను వేధించారు. ఎంత హెచ్చరించినా వినలేదు. ఆ బాధితురాలు ఎవరో కాదు.. రెవెన్యూ శాఖ డిప్యూటీ డైరక్టర్ భార్యే.
 
ఈ వ్యవహారాన్ని భర్త వచ్చిన తరువాత, జరిగిన విషయాన్ని ఆమె చెప్పినా, పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆయన ఫిర్యాదు చేయలేదు. ఆపై కమ్మనహళ్లి కేసులో నిందితుల అరెస్టు తరువాత, మనసు మార్చుకుని ఈ నెల 4న ఆయన ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు శివరాజ్ అనే వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది కోసం గాలిస్తున్నామని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చంద్రగుప్త వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా 15 మందిపై కేసులు పెట్టినట్లు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవింద నామస్మరణ స్థానంలో వింత శబ్దాలు... కామకేళికి అడ్డాగా తిరుపతి పార్కులు