Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారిద్దరూ వద్దు ... ఖర్గేను సీఎం చేయండి... : దళిత నేతల ప్రతిపాదన

Advertiesment
congress flag
, బుధవారం, 17 మే 2023 (15:59 IST)
కర్నాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ పార్టీకి చెందిన పెద్దలు ఢిల్లీలో సుధీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇటు డీకే శివకుమార్, అటు సిద్ధరామయ్యలు పట్టువీడటం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటక సీఎం చేయాలని రాష్ట్ర ఎస్సీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 
 
రాష్ట్రంలో ఎస్సీలు అత్యధికంగా ఉన్నందున ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు కర్ణాటక పీసీసీ కార్యాలయం ఎదుట వారు ఆందోళనకు దిగారు. అలా చేస్తే సిద్ధరామయ్య, డీకేలు నోరు మెదిపే అవకాశాలు ఉండవనే విశ్లేషణలు కూడా వినిపిస్తుండటం గమనార్హం. అలాగే, మరో దళిత నేత పరమేశ్వరను కూడా సీఎం చేయాలని వారు కోరుతున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్‌ చెప్పుల ధర రూ.1.35 లక్షలు.. పేలుతున్న మీమ్స్, ట్రోల్స్