Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్యూస్‌లో మత్తు కలిపి అత్యాచారం.. ఆపై వీడియో చూపుతూ...

కర్ణాటక రాష్ట్రంలో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని పట్టుకుని రేప్ చేస్తూ, వీడియో తీశాడు. ఈ అత్యాచారం నాలుగేళ్ల క్రితం జరిగింది. ఆ తర్వాత తాము చూపిన వీడియోను సోషల్ మీడియ

Advertiesment
Karnataka
, సోమవారం, 27 నవంబరు 2017 (14:30 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని పట్టుకుని రేప్ చేస్తూ, వీడియో తీశాడు. ఈ అత్యాచారం నాలుగేళ్ల క్రితం జరిగింది. ఆ తర్వాత తాము చూపిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరిస్తూ నాలుగేళ్ళుగా అత్యాచారపర్వం కొనసాగిస్తూ వచ్చారు. నాలుగేళ్ళుగా భరిస్తూ వచ్చిన ఆ యువతి ఆ కామాంధుల వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
కర్ణాటక కోలారు జిల్లా శ్రీనివాసపురానికి చెందిన యువతికి జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుర్మార్గాన్ని వీడియో తీసి అప్పటి నుంచి ఆమెను వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఆ యువతికి ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. నిందితులు బాధితురాలి భర్తకు వాట్సప్‌ ద్వారా ఆ వీడియో షేర్‌ చేశారు. 
 
ఈ వీడియో చూసి షాక్‌కు గురైన భర్త.. భార్యకు దూరంగా ఉంటున్నారు. దీంతో బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకడైన ఆరిఫ్‌ను అరెస్టు చేయగా మరో నిందితుడు తౌసిఫ్‌ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీటి కోసం బావి దగ్గరకు వెళ్ళిన వివాహితపై బలాత్కారం