Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రాఫిక్‌కు అంతరాయం : ముఖ్యమంత్రికి రూ.10 వేల ఫైన్!!

Advertiesment
Siddaramaiah

ఠాగూర్

, మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (17:01 IST)
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కర్నాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమేకాకుండా ఏకంగా రూ.10 వేల అపరాధం విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్రంలో గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు నాటి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ప్రధాన కారకుడని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ నేతలు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఆ సమయంలో మంత్రి ఈశ్వరప్ప రాజీనామాకు వారు పట్టుబట్టారు. 
 
గత 2022లో జగిరిన ఈ ధర్నా సందర్భంగా సిద్ధరామయ్య, ప్రస్తుత రవాణా మంత్రి రామలింగారెడ్డి, పరిశ్రమల శాఖామంత్రి ఎంబీ పాటిల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ రణదీప్ సుర్జేవాలాలు ట్రాఫిక్‌‍కు అంతరాయం కలిగించారంటూ గతంలో కేసు నమోదైంది.
 
ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతపై అపరాధం విధించింది. అందులోనూ ప్రజాప్రతినిధులు అయ్యుడి ట్రాఫిక్ అంతరాయం కలిగించడం ఎంతమాత్ం ఆమోదయోగ్యం కాదని కర్నాటక హైకోర్టు అభిప్రాయపడింది. పైగా, ఈ కేసును కొట్టివేయాలంటూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత మార్కెట్లోకి నథింగ్ ఫోన్ 2ఏ.. ఫ్లిఫ్ కార్టులో సేల్