విద్యార్థినిని బెదిరించి ఆర్నెల్లుగా అత్యాచారం చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు
కర్నాటక రాష్ట్రంలో ఓ కామాంధ ప్రధానోపాధ్యాయుడు తన వద్ద చదివే ఓ విద్యార్థినిపై ఆర్నెల్లుగా అత్యాచారం చేస్తూ వచ్చిన దారుణం ఒకటి తాజాగా వెలుగుచూసింది. అదీ కూడా ఆ విద్యార్థినిని బెదిరించి తనవశం చేసుకుని కా
కర్నాటక రాష్ట్రంలో ఓ కామాంధ ప్రధానోపాధ్యాయుడు తన వద్ద చదివే ఓ విద్యార్థినిపై ఆర్నెల్లుగా అత్యాచారం చేస్తూ వచ్చిన దారుణం ఒకటి తాజాగా వెలుగుచూసింది. అదీ కూడా ఆ విద్యార్థినిని బెదిరించి తనవశం చేసుకుని కామవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
కర్ణాటక రాష్ట్రంలోని పాతపాళెయం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలో దుగ్గప్ప అనే కామాంధుడు ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. తన వద్ద చదువుకునే ఓ విద్యార్థినిని దుగ్గప్ప బెదిరించి లొంగదీసుకుని.. గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ విషయం బయటకు చెప్పకూడదని విద్యార్థినిని బెదిరించాడు.
ఈ నేపథ్యంలో మైనర్ బాలిక సోమవారం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన కడుపుకొప్పికి గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్ళగా అసలు విషయం బయటపడింది.
తనను బెదిరించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అత్యాచారం చేస్తోన్న విషయాన్ని ఆ బాలిక బయటపెట్టింది. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు మేరకు పోలీసులు ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్పను అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు విచారణ జరుపుతున్నారు.