Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుమారస్వామి కుమారుడు వివాహం సింపుల్‌గా జరిగింది : సీఎం యడ్యూరప్ప

కుమారస్వామి కుమారుడు వివాహం సింపుల్‌గా జరిగింది : సీఎం యడ్యూరప్ప
, ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (16:04 IST)
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న వేళ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంట ఓ శుభకార్యం జరిగింది. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడకు వివాహం జరిపించారు. వధువు కాంగ్రెస్ మాజీ నాయకుడు కృష్ణప్ప మనవరాలు రేవతి. 
 
నిఖిల్ గౌడ - రేవతిల వివాహం రామనగర జిల్లాల్లో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులతో పాటు.. కేవలం 60 మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. 
 
అయితే, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలు అవుతున్న కారణంగా పెళ్లి వేదికను బెంగళూరు నుంచి రాంనగరలోని ఫామ్ హౌస్‌కు మార్చి, అనుమతులు తీసుకుని ఈ పెళ్లి జరిపించారు. అయినప్పటికీ విమర్శలు వచ్చాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిందిపోయి ఇలా వ్యవహరించడమేంటని చాలా మంది ప్రశ్నించారు.
webdunia
 
పైగా, ఈ వివాహానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప కూడా హాజరయ్యారు. అయితే, ఈ వివాహం వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించారు. ఆ పెళ్లిపై సానుకూలంగా వ్యాఖ్యానించారు. ఆ పెళ్లి గురించి చర్చించాల్సిన అవసరమేమీ లేదని, ఇందుకోసం అవసరమైన అనుమతులన్నీ ఇచ్చామని తెలిపారు. ఆ వివాహం కూడా చాలా సింపుల్‌గానే జరిగిందని వివరణ ఇచ్చారు. 
 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారి పరిమితుల్లో బాగానే చేశారని అన్నారు. అందుకు తాను వారిని అభినందిస్తున్నాని కూడా యడియూరప్ప అనడం గమనార్హం. కాగా, ఈ వివాహంపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ రాంనగర్‌ డిప్యూటీ కమిషనర్‌కు యడియూరప్ప ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బార్బర్ షాపునకు వెళ్తుతున్నారా? జర జాగ్రత్త...