Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీ నేత అవధేష్ కుమారులు అంత పనిచేశారా? ఎయిర్‌ హోస్టెస్‌పై?

బీహార్ మాజీ స్పీకర్, బీజేపీ నేత అవధేష్ నారాయణ్‌ ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసుకుంది. ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మడిగా లైంగిక వేధింపులకు దిగారనే ఆరోపణలపై అవధేష్‌ కుమారులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే

బీజేపీ నేత అవధేష్ కుమారులు అంత పనిచేశారా? ఎయిర్‌ హోస్టెస్‌పై?
, ఆదివారం, 20 మే 2018 (13:47 IST)
బీహార్ మాజీ స్పీకర్, బీజేపీ నేత అవధేష్ నారాయణ్‌ ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసుకుంది. ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మడిగా లైంగిక వేధింపులకు దిగారనే ఆరోపణలపై అవధేష్‌ కుమారులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే, ఓ ప్రైవేటు ఎయిర్ లైన్స్‌లో బాధితురాలు పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులు పట్నాలో ఉంటారు. 
 
తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చూసి వెళ్లేందుకు ఆమె పట్నాకు వచ్చింది. అవధేష్ కుమారుడు సుషాంత్ రంజన్‌కు ఎయిర్ హోస్టెస్‌కు ముందే పరిచయం వుంది. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ పరిచయంతో డిన్నర్‌కు ఆహ్వానించాడు సుశాంత్. వారు చెప్పిన చోటకు ఆమె వెళ్లింది. అక్కడే సుశాంత్ సోదరుడు ప్రశాంత్ కూడా ఉన్నాడు.
 
ఇద్దరూ కలిసి ఆమెను బంధించి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తండ్రికి చెందిన గెస్ట్ హౌస్‌లో ఆమెను బంధించి, వెళ్లిపోగా, అక్కడి ఉద్యోగుల సాయంతో బయటపడ్డ ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత కేసు నమోదు చేసుకునేందుకు వెనుకాడిన పోలీసులు, ఆపై 24 గంటల తరువాత కేసు పెట్టి దర్యాఫ్తు ప్రారంభించారు. కానీ అవధేష్ మాత్రం బాధితురాలు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. ఆమె చేసే ఆరోపణల్లో నిజం లేదంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రిలేని తొలిబిడ్డగా తావిసి.. వీర్యదాత పేరు నో.. ఆ కాలమ్ ఖాళీ..