Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లివింగ్ పార్టనర్ ఇంట్లో ఉరేసుకున్న మహిళ.. ఏం జరిగింది? హత్యా లేకుంటే..?

Advertiesment
suicide

సెల్వి

, సోమవారం, 9 జూన్ 2025 (18:52 IST)
జార్ఖండ్‌లో ఓ మహిళ తన లివింగ్ పార్టనర్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని ఝుమ్రీ తెలైయా పట్టణంలోని తన సహచరుడి ఇంట్లో 26 ఏళ్ల విడాకులు తీసుకున్న ఆయుషి చావ్లా మృతదేహం అనుమానాస్పద స్థితిలో వేలాడుతూ కనిపించిందని అధికారులు తెలిపారు.
 
కోడెర్మా జిల్లాలోని జైనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సాబాద్ నివాసి ఆయుషి, గత రెండు సంవత్సరాలుగా చిత్రగుప్త నగర్‌లో పండ్ల దుకాణం నడుపుతున్న తన భాగస్వామి హర్ష్ సోంకర్‌తో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో హర్ష్ ఉదయం  తన దుకాణం కోసం ఇంటి నుండి బయలుదేరానని, ఆ తర్వాత కొద్దిసేపటికే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ ఆయుషి నుండి ఫోన్ వచ్చిందని దర్యాప్తు సంస్థలకు తెలిపారు.
 
వెంటనే ఇంటికి తిరిగొచ్చి చూసే సరికి ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని చెప్పాడు. ఆమెను కిందకు దించే సమయానికి ఆమె చనిపోయిందని ఆరోపించారు. హర్ష్ పోలీసులకు మరియు ఆయుషి కుటుంబానికి ఈ సంఘటన గురించి సమాచారం ఇచ్చాడు.
 
వెంటనే పోలీసు బృందం అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపింది. ఇది ఆత్మహత్యా లేక అక్రమ సంబంధం ఉందా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. అయితే, ఆయుషి తల్లి హర్ష్ తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించింది. 
 
ఆయుషి గతంలో 2018లో ఝుమ్రీ తెలయ్యకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఆ వివాహం ఐదు సంవత్సరాల తర్వాత విడాకులతో ముగిసింది. తరువాత ఆమె హర్ష్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది. ఆమెకు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అతను ప్రస్తుతం తన అమ్మమ్మతో వున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నకిలీ సందేశంతో వల విసిరారు - బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్లకు అలెర్ట్