Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోటాలో ఒకవైపు ఆత్మహత్యలు మరోవైపు విద్యార్థుల అదృశ్యం...

suicide

సెల్వి

, సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (13:40 IST)
రాజస్థాన్‌లోని కోటా భారతదేశ కోచింగ్ హబ్‌గా కూడా పిలువబడుతుంది. అలాంటి ప్రాంతంలో ఒకవైపు విద్యార్థుల ఆత్మహత్యలు మరోవైపు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఒక వారంలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీయూష్ కపాసియా ఫిబ్రవరి 13 నుంచి కనిపించకుండా పోయాడు. జేఈఈ  ఆశించిన పీయూష్ గత రెండేళ్లుగా కోటలోని ఇంద్ర విహార్‌లోని హాస్టల్‌లో ఉంటున్నాడు.
 
 గత మంగళవారం ఉదయం పియూష్ తన తల్లితో మాట్లాడాడని, ఆ తర్వాత కుటుంబ సభ్యుల కాల్స్ లిఫ్ట్ చేయలేదని అతని తండ్రి మహేశ్‌చంద్ చెప్పారు. తర్వాత అతను తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని తెలిపారు. పీయూష్‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఆదివారం కోటాలో మరో విద్యార్థి రచిత్ సోంధ్య అదృశ్యమైన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన రచిత్‌ సోంధ్య జవహర్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటోంది.
 
16 ఏళ్ల రచిత్ సోంధ్య చివరిసారిగా గరాడియా మహాదేవ్ ఆలయానికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడం సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో కనిపించింది. 
 
ఆ ప్రాంతం నుంచి అతని వస్తువులు - బ్యాగ్, కీలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దట్టమైన అడవిలో అతని జాడ కోసం డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. రచిత్ తల్లిదండ్రులు తమ కుమారుడిని కనుగొనడానికి సహాయం చేయాలని ప్రజలను కోరుతూ అతని పోస్టర్‌లను అంటిస్తున్నారు. 
 
రచిత్‌ను పోలీసులు కనుక్కోకపోతే నిరసన తెలుపుతామని అతని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. JEE, NEET వంటి పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఏటా 2 లక్షల మంది విద్యార్థులు కోటాలో వస్తారు. 
 
అయితే ఈ ఏడాది కోటాలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత సంవత్సరం, విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడంతో, కోచింగ్ విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. డిప్రెషన్, ఒత్తిడి నుండి విద్యార్థులను రక్షించడానికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, జిల్లా పరిపాలనలకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులతో కేంద్ర మంత్రుల చర్చలు... తాత్కాలికంగా ఛలో ఢిల్లీ వాయిదా