Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలితను చంపేసిన పండ్ల రసం... శశికళే ఇచ్చారా? సోషల్ మీడియాలో హల్‌చల్

అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారనీ కొందరు అంటుంటే.. ఆమెకు ఇచ్చే మందులు మార్చివేశారని మరికొందరు అంటున్నారు.

జయలలితను చంపేసిన పండ్ల రసం... శశికళే ఇచ్చారా? సోషల్ మీడియాలో హల్‌చల్
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (08:33 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారనీ కొందరు అంటుంటే.. ఆమెకు ఇచ్చే మందులు మార్చివేశారని మరికొందరు అంటున్నారు. అయితే, ఇపుడు మరో వార్త హల్‌చల్ చేస్తోంది. జయలలిత మరణానికి పండ్ల రసమే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
గత యేడాది సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీ రాత్రి చనిపోయిన విషయం తెల్సిందే. సుమారు 72 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె.. గుండెపోటు కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఇదే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 
 
అయితే, అసలు వాస్తవం అది కాదంటూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న జయ బాగా కోలుకున్న స్ధితిలో డాక్టర్ల అనుమతి లేకుండా తాగిన పండ్ల రసం వల్లే గుండెపోటుకు గురయ్యారని సరికొత్త కథనం ప్రచారంలోకి వచ్చింది. జయ పండ్ల రసం తాగుతున్న సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులు కూడా పట్టించుకోలేదని, ఆ జ్యూస్‌ కారణంగానే ఆమె మృతి చెందారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విలీనంపై మంతనాలు: నేడే పన్నీర్, పళనిస్వామి వర్గాల తుది చర్చలు